చిలిపిచెడ్ (కొల్చారం), ఏప్రిల్ 14: కొల్చారం, చిలిపిచెడ్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఏసీఎస్ సీఈవోలు, ఐకేపీ సిబ్బంది ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. కానీ రైస్మిల్లులకు ఎప్పుడు తరలిస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఒక్క బస్తా కూడా తూకం వేయలేదు. రైస్మిల్లులకు తరలించలేదు. గన్నీ బ్యాగుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నదని ఆందోళన చెందుతున్నారు. దీంతో మరిం త నష్టం జరుగక ముందే అధికారులు స్పం దించి ధాన్యం త్వరగా తరలించేందుకు చర్య లు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో రంగంపేట పీఏసీఎస్ సీఈవో నవీన్ ను వివరణ కోరగా.. త్వరగా ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలిస్తామన్నారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్లో శుభ్రం చేయాలని తెలిపారు.
రామాయంపేట, ఏప్రిల్ 14 : రోడ్లపై ధాన్యం పోసి ప్రమాదాలకు కారణమవుతు న్నవారిపై కేసులు పెడతామని ఎస్సై రంజిత్ హెచ్చరించారు. రైతులు తమ ధాన్యాన్ని ఇంటివద్దే నూర్పిళ్లు చేసుకోవాలన్నారు. ఆదివారం రామాయంపేట హైవేపై ధాన్యం ఆరబోసిన కుప్పలను తొలిగించి, అక్కడే ఉన్న రైతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రోడ్లపై నూర్పిళ్లతో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయన్నారు. రోడ్లపై ధాన్యం కనిపిస్తే తీసుకెళ్లడంతోపాటు, ఆరబోసిన రైతులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్సైతో పాటు సిబ్బంది ఉన్నారు.