చేగుంట, మార్చి 10: విద్యుదాఘా తానికి రైతు బలైన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం బీ-కొండాపూర్లో ఆదివారం ఉద యం చోటుచేసుకుంది. బాధిత కుటుంబం, పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన రైతు బోయిని గణేశ్(42)తనకు ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి, మక్క పంట వేశాడు. పంట చేతికి వచ్చే సమయంలో నీరందక ఎండిపోతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున పారకం పెట్టేందుకు చేను వద్దకు వెళ్లాడు.
బోరు నడవక పోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద వైరును సరిచేసే సమీపంలో విద్యుత్ షాక్కు గణేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య కమల ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య కమల, కుమారులు కార్తీక్, అనిల్ ఉన్నట్లు చేగుంట ఎస్సై బాల్రాజు తెలిపారు.