మెదక్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. 22 రోజులుగా జిల్లాలో 1,25,288 మందికి కంటి పరీక్షలు చేశారు. 15,321 మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 13,927 మందికి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. సోమవారం జిల్లాలో 6317 మందికి కంటి పరీక్షలు చేశారు. 601 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 563 మందికి అద్దాలకు ఆర్డర్లు ఇచ్చినట్లు మెదక్ డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలో 69 వైద్య శిబిరాలు నిర్వహించారు. 17,491మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 8531 మంది పురుషులు, 8960 మంది మహిళలకు ఉన్నారు. 1246 మందికి కండ్లద్దాలు అందజేశారు. 413 మంది పురుషులు, 528 మంది మహిళలకు ప్రిస్కిప్షన అద్దాలు ఆర్డర్ చేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 813 మంది పురుషులు, 852 మంది మహిళలకు కండ్ల ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు.