మెదక్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతోపాటు ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ నుంచి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మశ్రీ, మెదక్ ఆర్డీవో రాజేశ్వర్, నర్సాపూర్ ఆర్డీవో శ్రీనివాస్ వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ మాట్లాడుతూ త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పార్లమెంటు ఎన్నికలకు ఓటర్ల జాబితా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. 2024 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మార్పులు, చేర్పులు, చిరునామా మారిన వారు చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిషరించాలని ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్లో ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ హరిదీప్ సింగ్, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్, సంబంధితశాఖ అధికారులు పాల్గొన్నారు.