కోహీర్, ఏప్రిల్18: జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ విజయానికి ప్రతిఒక్కరూ సమన్వయం తో పని చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. గురువారం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న గాలి అనిల్కుమార్కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో నియోజకవర్గ బాధ్యులు కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, మాజీఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, హనుమం తు షిండే, సురేందర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.