చిలిపిచెడ్, ఫిబ్రవరి 6 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి భక్తిమార్గంలో నడవాలని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో అక్కమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవాల్లో మాధవానంద సరస్వతీస్వామి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో మాట్లాడారు. కార్యక్రమంలో అర్చకులు గిరిధారాచారి, నర్సింహులు,రవికుమార్, పండరి పాల్గొన్నారు.
వైభవంగా మల్లికార్జున స్వామి కల్యాణం
నిజాంపేట, ఫిబ్రవరి 6 : మండలంలోని కల్వకుంట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన మల్లికార్జున స్వామి కల్యాణానికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నదానం ఏర్పాటు చేయగా ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందె ఇందిర, పీఏసీఎస్ చైర్మన్ అందె కొండల్రెడ్డి, నగరం సర్పంచ్ గేమ్సింగ్, కల్వకుంట మాజీ సర్పంచ్ భవానీవెంకట్గౌడ్,కో ఆప్షన్ మాజీ సభ్యుడు అబ్దుల్ అజీజ్, బీఆర్ఎస్ నాయకులు కొమురయ్య, లక్ష్మీనర్సింహులు, రాములు, రాజు, మల్లేశం, నగేశ్ పాల్గొన్నారు.
కన్నుల పండువగా శివ పడిపూజ
నర్సాపూర్, ఫిబ్రవరి 6 : మున్సిపల్లోని 2వ వార్డు కౌన్సిలర్ లతారమేశ్యాదవ్ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ మహారుద్రాభిషేకం, మహాపడిపూజ నిర్వహించారు. మహాపడి పూజ కార్యక్రమానికి శివస్వాములు, గురుస్వామి వీరప్ప హాజరయ్యారు.