గజ్వేల్, ఆగస్టు 6 : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని మంజీరా కాన్సెప్ట్ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమం లో పాల్గొని మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో కిరణ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక మొక్క నాటి సంరక్షించాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై ప్రతిఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా సేవ్ ట్రీస్ అంటూ ఇంగ్లిష్ పదాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకుడు అంబదాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.