రామాయంపేట/నర్సాపూర్/మెదక్రూరల్/కొల్చారం/మనోహరాబాద్/మెదక్ మున్సిపాలిటీ, జనవరి 23 : కరోనా వ్యాప్తిని ఆరికట్టేందుకు పట్టణంలో జరుగుతున్న ఇంటింటా జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ సూచించారు. ఆదివారం పట్టణంలోని 11, 12వ వార్డుల్లో జరుగుతున్న సర్వేను ము న్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్ సమియొద్దీన్లతో కలిసి పరిశీలించారు. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి పీటీలో ద్రావణాన్ని పిచికారీ చేశారు. కొల్చారం మండల వ్యాప్తంగా ఇంటింటా జ్వరసర్వే ము మ్మరంగా కొనసాగుతున్నది. ఏటిగడ్డమాందాపూర్లో సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి జ్వరం ఉన్నవారి వారికి హోంఐసొలేషన్ కిట్లు అందజేశారు. మెదక్ మండల పరిధిలోని పాతూరు, జానకం పల్లి ఆయాగ్రామల్లో లక్షణాలు ఉన్నవారికి వైద్య సిబ్బంది కిట్లు అందజేశారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి నయీం, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
రామాయంపేటలో..
జ్వర సర్వేను సిబ్బంది వేగవంతం చేయాలని రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి అన్నారు. రామాయంపేట పట్టణంలోని మూడో వార్డులోని ఆరోగ్య సిబ్బందితో జ్వరసర్వేలో పాల్గొని కరోనా కిట్లను అందజేశారు.