రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా గురువారం భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కివుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో భానుడి భగభగల నుంచి తమను తాము రక్షించుకునేందుకు పిల్లలు, పెద్దలు గొడుగులు పట్టుకొని బయటకు వచ్చారు. ఎండ నుంచి ఉపశమనం కోసం చల్లటి పానీయాల సెంటర్లను ఆశ్రయిస్తూ ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కారు.