కొండాపూర్, అక్టోబర్ 31: ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నా, గెలిచిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పత్తకే లేడు. తాను ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండి, ప్రజలకు నిత్యం సేవలు చేశానని, అందువలన మీరే నా బలం, నా బలగం అని తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం కొండాపూర్ మండలంలోని మల్కాపూర్లో కొండాపూర్ మండల ముఖ్య కార్యకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలను ఇంత మోసానికి గురి చేస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి ఎట్లా గెలుస్తాడో తాము కూడా చూస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే చింతా ప్రభాకర్ను గెలపించాలని డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం కోరారు. కార్యక్రమంలో మండల ఎన్నికల ఇన్చార్జి తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ పద్మావతీపాండురంగం, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, ఎంపీటీసీ శ్రీనివాస్గౌడ్, సొసైటీ చైర్మన్లు పవన్కుమార్, రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, బీఆర్ఎస్ నాయకులు మల్లాగౌడ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షలు శ్రీధర్రెడి, నాయకులు జగదీశ్వర్, గోవర్థన్రెడ్డి, నాగయ్య, సత్యనందం, మాణిక్య ప్రభు , ప్రభుదాస్, జలీల్, అమినోద్దీన్ పాల్గొన్నారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ప్రజలు ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ ఐదేండ్ల వరకు దొరకకుండా పోతాడని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కొండాపూర్ మండలంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, సీఎం కేసీఆర్ బలపరిచిన వ్యక్తి చింతా ప్రభాకర్కు ఓటేసి గెలిపించాలని కోరారు.