పటాన్చెరు/గుమ్మడిదల,మార్చి 20 : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సోమవారం పటాన్చెరులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నూతన పేస్కేల్ను చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వ్యులు జారీ చేసిన సందర్భంలో పటాన్చెరు నియోజకవర్గంలోని సెర్ప్ ఉద్యోగులు సంతోషంతో సంబురాలు నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి స్వీట్లు పంపిణీ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.
ఈ సందర్భంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమమైన వేతనాలను అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 3,974మంది, జిల్లాలో 193 మంది, నియోజకవర్గంలో 21మందికి జీతాలు పెరిగాయి. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా మండలాల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు శ్రీనివాస్, శివకుమార్, నరేందర్, మధులత తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదల మండల కేంద్రంలో మండల సమాఖ్య సంఘం భవనం ప్రాంగణంలో ఐకేపీ ఏపీఎం శివకుమార్, తెలంగాణ రాష్ట్ర గ్రామీణాపేదరిక నిర్మూలన సంఘం ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల సెర్ప్ ఉద్యోగులు పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు.