సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 25: సంగారెడ్డి జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ శర త్ అధికారులకు ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాను న్న సార్వత్రిక ఎన్నికల్లో సెక్టోరల్ అధికారు లు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను వారు సందర్శించి, మౌలిక వసతులను పరిశీలించి సత్వర చర్యలకు నివేదికలు అందించాలన్నారు. పోలింగ్ కేంద్రం వారీగా కమ్యూనికేషన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు.
పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఉండాలని, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేం ద్రాల ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఓటు వేయకుండా భయపెట్టే వా రు, భయపడే వారి వివరాలు అందించాలన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు రాజకీయ పార్టీల కార్యాలయాలు ఉన్నాయా అనే విషయాన్ని గమనించాలన్నారు. జండర్ రేషియో క్రాస్ చెక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. సెక్టోరల్ అధికారి అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈవీఎం మొబైల్ డెమోనిస్ట్రేషన్ చేస్తామన్నారు. జిల్లాలోని ఓటర్లకు ఓటు వేసే ప్రక్రియపై అవగాహన కల్పించాలని కలెక్టర్ వివరించారు. శిక్షణకు హాజరుకాని సెక్టోరల్ అధికారులకు సంజాయిషీ నోటీసులు జారీచేయాలని సంబంధిత నియోజకవర్గాల ఈఆర్వోలను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు సెక్టోరల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్వో నగేశ్ పాల్గొన్నారు.