మెదక్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితాపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్కు మెదక్ సమీకృత కలెక్టరేట్ నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ..పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిషరించాలని, ఏప్రిల్ 26 నాటికి తుది ఓటరు జాబితా రూపొందించాలన్నారు.
ఎన్నికల్లో ముందస్తుగానే ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టాలని, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్పై పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు సమాచారం అందించాలన్నారు. గురువారం రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని, 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. నామినేషన్ స్వీకరణ, స్రూట్నీ, ఉపసంహరణ, పోటీ చేసే తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ రూపకల్పన వంటి అంశాలను మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలన్నారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పోటీ చేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్డెస్తోపాటు నామినేషన్ దాఖలుకు ముందు ప్రీ వెరిఫికేషన్ డెస్ వద్ద పరిశీలించాలన్నారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ జరగాలని, చాంబర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణపై ప్రతిరోజూ నివేదికలను సమర్పించాలన్నారు. కార్యక్హరమంలో డీఆర్వో పద్మశ్రీ, మెదక్ ఆర్డీవో రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ హర్దీప్ సింగ్, ఇడియం సందీప్, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్, తదితర అధికారులు పాల్గొన్నారు.