సంగారెడ్డి, సెప్టెంబర్ 17: రసాయనాలతో తయారు చేసిన గణపతులతో నీటి కాలుష్యంతోపాటు చెరువులు, కుంటల్లో ఉండే జలచర జీవరాశులు చనిపోతున్నాయని, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి సూచించారు.
ఆదివారం పట్టణ పరిధిలోని కాకతీయనగర్ కాలనీలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ పన్నెండేళ్లుగా మట్టి గణేశులను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించి నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు. కార్యాక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయేందర్రెడ్డి, కాలనీవాసులు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.