పాపన్నపేట, డిసెంబర్ 15: ఏడుపాయల వనదుర్గా భవానీమాతను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి సునీతాలక్ష్మారెడ్డి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజలు చేసి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి, ధర్మకర్తలు మనోహర్, మోహన్రావు, యాదవ్గౌడ్, బాగారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.