‘మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజులు నిర్వహించే ఏడుపాయల జాతరను విజయవంతం చేయాలని, ఇందుకోసం అధికారులంతా సమష్టిగా పనిచేయాలి.’ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.’ గురువారం కలెక్టరేట్లో జాతర నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జాతర నిర్వహణకు రూ.2 కోట్లు మంజూరు చేశారని, భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. బస్టాండు నుంచి ఉచిత బస్సు సర్వీసులు నడపాలని, విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. స్నానమాచరించే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు.
మెదక్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ నెల 18నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే ఏడుపాయల జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుం డా అధికారులందరూ సమష్టితో పని చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జాతర నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 8సంవత్సరాల నుంచి విజయవంతంగా జాతరను నిర్వహిస్తున్నామని, జాతర నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 2కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ సమష్టిగా పనిచేయాలని హితవు పలికారు.
రాష్ట్రంలోనే మూడు రోజుల పాటు నిర్వహించే అతిపెద్ద ఏడుపాయల జాతరకు హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి 8లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశముందన్నారు.
నాగ్సాన్పల్లి, పోతంశెట్టిపల్లి ఇరు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశమున్నందున బారీకేడ్, లైటింగ్, పారింగ్, సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి పోలీసు కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలన్నారు. మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధిక సంఖ్యలో టాయిలెట్స్, బట్టలు మార్చుకొనుటకు గదులు ఏర్పాటు చేయాలని సూ చించారు. భక్తులు స్నానమాచరించుటకు విరివిగా షవర్లు, నీటి సదుపాయాలు కల్పించాలన్నారు. దుమ్ము, దూళి లేవకుండా ప్రతిరోజు రోడ్లపై నీళ్లు చల్లాలని, విద్యుత్లో అంతరాయం లేకుండా చూడాలని, నీటి ప్రవాహం, స్నానమాచరించే ప్రాంతాలో, బ్రిడ్జిల వద్ద గజ ఈతగాళ్లను నియమిం చాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అంబులెన్స్లు, అగ్నిమాపక వా హనాలు ఏర్పాటు చేయాలని, శానిటేషన్, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ వంటివి చేయాలన్నారు. బస్టాండు నుంచి దేవస్థానం వరకు ఉచితంగా మినీ బస్సులు, పోలీసుల ఆధ్వర్యంలో 10ఆటోలు నడుపాలని సూచించారు. బందోబస్తు విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా జాతరలో అడ్డదిడ్డంగా టెంట్లు వేయకుండా నిరోదించాలన్నారు. ఈ సందర్భంగా జాతర పోస్టర్ను ఆవిషరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేశ్, ఇఫో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరామ్, అధికారులు పాల్గొన్నారు.
పవిత్ర దైవకార్యంగా భావిస్తూ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులందరూ సమిష్టిగా పని చేస్తూ రెండు రోజుల ముందుగా అన్ని ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గత జాతరలో శానిటేషన్ బాగా చేశారని ఈసారి కూడా లేబర్ను ఎకువ పెట్టుకొని పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జాతరలో శౌచాలయాలు, తాగునీటి సౌకర్యం, షవర్లు, ఆలయ ప్రవేశ ద్వారం తదితర వాటిని భక్తులు గుర్తించే విధంగా మ్యాప్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దర్శనం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలని, పండల్స్, ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
– మెదక్ కలెక్టర్, రాజర్షి షా
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడు తూ ఈ నెల 17 నుంచే పోలీసు బందోబస్తులో ఉండాలని, సీసీ కెమెరాలు కంట్రో ల్ రూమ్కు అనుసంధానం చేసి పర్యవేక్షించాలన్నారు. గజ ఈతగాళ్లు లైఫ్ జాకెట్లతో భక్తులు స్నానమాచరించే ప్రాంతా ల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతర సందర్భంగా ఏర్పా టు చేసే జాయింట్ వీల్స్, రంగుల రాట్నం పటిష్టతగా ఉండే విధంగా పరిశీలించాలన్నారు.
– ఎస్పీ రోహిణిప్రియదర్శిని