పాపన్నపేట,ఏప్రిల్17 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులు మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఒడిబియ్యం,కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో సార శ్రీనివాస్ సిబ్బంది సూర్యశ్రీనివాస్, మధుసూధన్రెడ్డి, రవివీర్కుమార్, మహేశ్ తదితరులు తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.