దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని, దుబ్బాకలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం నార్సింగి మండల కేంద్రంలో దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి రోడ్డుషోలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. మాయమాటలు చెప్పి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రజలకు చేసిందేమీలేదని, ఆయన వట్టి కోతల రాయుడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోసం అరిగోస పడ్డామని గుర్తుచేశారు. ఓట్లంటే మూడొద్దుల పండుగ కాదని, ఐదేండ్ల మన భవిష్యత్ను నిర్ణయిస్తాయన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన కొత్త ప్రభాకర్రెడ్డి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి ఆయనను గెలిపించాలని
మంత్రి విజ్ఞప్తి చేశారు.
చేగుంట, నవంబర్ 22 : కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోతే గోస పడతామని, తెలంగాణను సీఎం కేసీఆర్ ఆదర్శంగా మార్చారని, చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని తెచ్చిండు.. కేసీఆర్తోనే తెలంగాణ సురక్షితమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా నార్సింగిలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి బుధవారం బీఆర్ఎస్ రోడ్డుషోలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నం పెట్టే రైతు బాగుండాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమాతో 5 లక్షల ఉచిత బీమా వర్తించనున్నందని తెలిపారు. ఇప్పటి వరకు కోటి 14వేల కోట్ల రైతు రుణమాఫీ అయ్యిందని, 4 వేల కోట్ల రుణమాఫీ ఉందని, ఎన్నికల కోడ్ అయిపోగానే మిగిలిన రైతులకు రైతు రుణ మాఫీ అందుతుందన్నారు. కేసీఆర్ రైతులకు రైతు బంధు ఇచ్చిన దేవుడని, కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంటుతో మడికూడా తడవదన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లులేని ప్రతి పేద వారికి సాయం అందిస్తామన్నారు. తెలంగాణ రావడం వల్లే కొత్తగా నార్సింగి మండలం ఏర్పాటు జరిగిందన్నారు. మూడు గంటల కరంటు సరిపోతుందని, రేవంత్రెడ్డి చెప్పడం చూ స్తుంటే తెలంగాణ రైతులను అన్యాయం చేసే కాంగ్రెస్కు ఓటు ద్వారా బుద్ధ్ది చెప్పాలన్నారు.
బీజీపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానాన్ని చెప్పి తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలను మెండి చెయ్యి చూపించిందన్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టెందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయన్నారు. ఇప్పటికే లక్షా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 50 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ ద్వారా భర్తి ప్రక్రియ కోనసాగుతుందన్నారు. మ్యానిఫెస్టులో ఉన్నవాటిని అమ లు చేస్తామన్నారు. మాయ మాట లు చెప్పే పార్టీల మాటలు పట్టుకుంటే గోసా పడవల్సిన పరిస్థితి వస్తుందని, ప్రజలు బాగా ఆలోచించుకోవాలన్నారు. గత మూడు సంవత్సరాల కింద దుబ్బాకలో జూట మా టలుతో ప్రజలను మోసం చేసి గెలిచిన రఘునందన్రావు పైసా పనిచేయలేదని విమర్శించారు. ఆపదలో ఉన్న కొత్త ప్రభాకరన్నను భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కోరారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవని, ఓట్లంటే మూడొద్దుల పండుగ కాదని, ఐదేండ్ల మన భవిష్యత్ను నిర్ణయిస్తాయన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన కొత్త ప్రభాకర్రెడ్డి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి ఆయనను గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
దేవుడి దయ.. మీ ఆశీర్వాదంతోనే మీ ముందుకు వచ్చానని మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్ సహకారంతో దుబ్బాకను అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తానని కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. నార్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రోడ్డుషోలో కొత్త ప్రభాకర్రెడి ్డపాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, మరో సారి సీఎం కేసీఆర్ను గెలిపించుకోవాలని ప్రభాకర్రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నార్సింగి ఎంపీపీ చిందం సబీతారవీందర్, వైస్ ఎంపీపీ దోబ్బల సుజాతాశంకర్, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు మైలరాం బాబు, దుబ్బాక నియోజక వర్గ బీఆర్ఎస్ నాయకులు చిందం రాజ్కుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశోక్, మండల ఆర్య వైశ్యసంఘం అధ్యక్షుడు ఎర్రం శ్రవణ్,(బాబీ), మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, ఎంపీటీసీలు ఆకుల సుజాత, సొసైటీ చైర్మన్ శంకర్గౌడ్, మండల రైతుబంధు అధ్యక్షుడు ఎన్నం లింగారెడ్డి, శ్రీపతి రావ్, నర్సింహాచారి, ఆకుల మల్లేశంగౌడ్, మాజీ సర్పం చ్ దాలె కృష్ణమూర్తి, సర్పంచ్లు అనందాస్ మహేశ్వరి నరేశ్, చెప్యాల మల్లేశం, ఛత్రీయ, పట్టణశాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, కుమ్మరి నర్సింహులు, భూపతి, సత్యం, యాదగిరి యాద వ్ తదితరులు ఉన్నారు.
చేగుంట, నవంబర్ 22 : నార్సింగి మండల కేంద్రంలోని మాజీ టెలికాం బోర్డు సభ్యుడు అంచనూరి రాజేశ్ తండ్రి ఇటీవల మృతి చెం దాడు. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలరాం బాబు, ఎంపీటీసీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థికొత్తప్రభాకర్రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించాలని కోరుతూ చేగుంటతో పాటు పలు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాంపూర్లో బీఆర్ఎస్ నాయకులు బిస్కీ సాయికుమార్, స్వామి, కాశబోయిన సుదర్శనం, నాగులు,లక్ష్మణ్, చంద్రం, పులిమామిడిలో సర్పంచ్ గొర్రె రేణుకారమేశ్, చేగుంట పట్టణాధ్యక్షుడు యాదగిరి, సోమ సత్యనారాయణ ఉన్నారు.
బీజేపీ నుంచి బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి, నాయిని రాజ్గోపాల్, సర్పంచ్ మోహన్ ఆధ్వర్యంలో చేగుంట మండ ల పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన 40మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమంతోనే దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.