మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి నగేశ్ పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లో పోలీస్, వైద్యారోగ్య శాఖ, ఎక్సైజ్, అటవీ, వ్యవసాయ, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, విద్యా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ్ద వహించి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.