పుల్కల్, జూలై 17: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేసినట్లు సింగూర్ ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల తాగునీటి అవరాల కోసం 0.1టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
తాగునీటి కోసం 0.3టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉండగా, విడతల వారీగా నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం4.5 టీఎంసీల నీరు నిల్వఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని ప్రజలు, పశుకాపరులు మంజీరా పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని ఆదేశాలు జారీచేశారు.