సిద్దిపేట, మార్చి7: సిద్దిపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో రెండు నెలలుగా పారిశుధ్య నిర్వహణ సరిగా లేక డ్రైనేజీలు అన్ని మురుగుతో నిండి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ‘నమసే’్తలో వచ్చిన కథానానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి వెంటనే ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న పారిశుధ్య సమస్యలు పరిష్కారించాలని అ ధికారులను ఆదేశించారు. శానిటరీ జవాన్ మల్లేశం ఆధ్వర్యంలో పారిశుధ్య పనుల్లో భాగంగా మురుగు కాల్వలను శుభ్రపరిచారు. దీంతో కాలనీప్రజలు హర్షం వ్యక్తం చేశారు.