పెద్దశంకరంపేట/ మెదక్ మున్సిపాలిటీ/ చిన్నశంకరంపేట/ నర్సాపూర్/ చేగుంట, జనవరి 5 : అర్హులందరికీ రాజకీయాలకతీతంగా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తున్నదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజాపాలన నిర్వహిస్తున్నామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామనిఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ వీణాసుభాశ్గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మధు, నాయకులు సురేందర్రెడ్డి, సంతోష్కుమార్, రాజేందర్గౌడ్, జనార్దన్, సంగమేశ్వర్, పండరి, గంగారెడ్డి పాల్గొన్నారు.
మెదక్ పట్టణ ప్రజలు ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చంద్రపాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని 25, 26, 27, 28వ వార్డుల్లో ప్రజాపాలనను ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఆరు గ్యారెంటీలు అందుతాయని, ఈ నెల 6లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. చైర్మన్ వెంట మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, యశోధాకృష్ణాగౌడ్, శేఖమ్మ, మమత, బీఅర్ఎస్ నేతలు కృష్ణాగౌడ్, ఉమర్ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట మండలంలోని చందాపూర్, జంగరాయి, అంబాజిపేట, జంగరాయి తండాల్లో అధికారులు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నర్సాపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రజాపాలనలో భాగంగా సంక్షేమ పథకాలు అందిస్తామని ఎంపీపీ జ్యోతీసురేశ్నాయక్ తెలిపారు. నర్సాపూర్ మండలం మాడాపూర్, మూసాపేట్, మహమ్మదాబాద్, ఎల్లారెడ్డిగూడతండాలో ప్రజాపాలన నిర్వహించారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, బ్లాక్ అధ్యక్షుడు రిజ్వాన్, మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్గుప్తా, తహసీల్దార్ కమలాద్రి పాల్గొన్నారు.
ప్రజాపాలనతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రామాయంపేట ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్ రజినీకుమారి, కౌన్సిలర్ యా దగిరి అన్నారు. పట్టణంలోని 6వ వార్డులో దరఖాస్తులు స్వీకరించా రు. కార్యక్రమంలో ఆర్పీ స్వాతి, అంగన్వాడీ టీచర్ రాణి ఉన్నారు.
చేగుంట మండలం చందాయిపేట, చిన్నశివునూర్, కర్నాల్పల్లి గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహించారు. అర్హులందరూ దరఖాస్తు చేసు కోవాలని డిప్యూటీ తహసీల్దార్ స్వప్న సూచించారు. కార్యక్రమాల్లో ఆర్ఐ నర్సింగ్యాదవ్, ఏవో హరిప్రసాద్, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఏ ఈలు మమత, వెంకటేశ్, సర్పంచ్లు సంతోష్రెడ్డి, స్వర్ణలత, అశోక్, ఎంపీటీసీ శ్రీను, ఉప సర్పంచ్ సంతోష్కుమార్, ఎంపీవో హనుమంత్రావు, కార్యదర్శులు జగదీశ్, కృష్ణ, ఏఈవో అశోక్రెడ్డి ఉన్నారు.