గజ్వేల్/సిద్దిపేట అర్బన్, మార్చి 20: అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట, గజ్వేల్లో నిర్వహించిన రెండు నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. ఓడిపోయిన అభ్యర్థులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దీన్ని తెలంగాణ సమాజం సహించదన్నారు.
అధికారంలోకి రాగానే రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తానని, రూ.4 వేల పెన్షన్ ఇస్తానని చెప్పి.. మూడు నెలలైనా చేయలేదని విమర్శించారు. రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని స్వయంగా రాహుల్గాంధీ సమక్షంలోనే చెప్పారని, ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. బీజేపీతోనే దేశం బలంగా ఉంటుందని, బీజేపీకి ఓటేసి గెలిపించాలని ప్రజలకు రఘునందన్రావు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి, నాయకులు రాంరెడ్డి, మహే శ్, కిరణ్, సత్తయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.