ఏ రాష్ట్రంలోనూ అమలుకు సాధ్యం కాని సంక్షేమ పథకాలతో ప్రజల బతుకుల్లో మార్పు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు కోరారు. రైతుల బతుకులకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ను మరువొద్దని ఆయన కార్యకర్తలకు, ప్రజలకు సూచించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. హవేళీఘనపూర్ మండల కేంద్రంలోని శ్రీసాయి శ్రీనివాస గార్డెన్స్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీశ్రావుతోపాటు జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రజలు ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై ప్రజల మధ్య చర్చిస్తూ వారిలో చైతన్యం తీసుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు.
హవేళీఘనపూర్, ఏప్రిల్ 5: ఏ రాష్ట్రంలోనూ అమలుకు సాధ్యం కాని సంక్షేమ పథకాలతో ప్రజల బతుకుల్లో మార్పు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు కోరారు. రైతుల బతుకులకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ను మరువొద్దని ఆయన కార్యకర్తలకు, ప్రజలకు సూచించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. హవేళీఘనపూర్ మండల కేంద్రంలోని శ్రీసాయి శ్రీనివాస గార్డెన్స్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీశ్రావుతోపాటు జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గత ఏ ప్రభుత్వాలు చేయలేని పనులను సీఎం కేసీఆర్ చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో ప్రవేశపెడుతున్న రైతు పథకాలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా కుట్రలు పన్ని అధికారంలోకి రావాలని చూస్తుందని విమర్శించారు. ప్రజలు ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి తగిన బుద్ధి చెబుతారన్నారు. నేడు తెలంగాణలోని ప్రతి ఇంటిలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు. కరోనా కారణంగా కొన్ని పథకాల అమలులో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వీలైనంత త్వరగా వాటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై ప్రజల మధ్య చర్చిస్తూ వారిలో చైతన్యం తీసుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ వైస్చైర్మన్ లావణ్యరెడ్డి, మెదక్ పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి మాణిక్యరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు ఖాలేద్, పీఎసీఎస్ డైరెక్టర్ సాప సాయిలు, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
– మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
పేదలకు పెద్ద దిక్కు సీఎం కేసీఆర్ అని, ప్రజలు సీఎం కేసీఆర్ను పెద్ద కొడుకులా భావించి ఆయనను ఆశీర్వదిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. హవేళీఘనపూర్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. కరోనాతో అల్లాడిన రాష్ర్టాన్ని అన్ని విధాలా గాడిన పెట్టేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మెదక్ నియోజకవర్గంలో చెక్డ్యామ్లను నిర్మించి వేసవి కాలంలో సైతం రైతులకు సాగు నీరందిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్సేనన్నారు.
– బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం
రాష్ట్ర అభివృద్ధికి కోసం అహర్నిశలు పని చేస్తున్న బీఆర్ఎస్ను ఆదరించాలని, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని మరోమారు ఆశీర్వదించాలని జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం అన్నారు. బీఆర్ఎస్ హవేళీఘనపూర్ మండల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయన్నారు. రాబోయే రోజుల్లో పద్మాదేవేందర్రెడ్డిని తిరిగి 50 వేల మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.