రామచంద్రాపురం, జనవరి 8: పటాన్చెరు నియోజకవర్గంలోని అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పనిచేస్తున్నారని తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్లోని న్యూలైఫ్ చర్చి అభివృద్ధికి ఎమ్మెల్యే అందించిన రూ.15 లక్షల విరాళాన్ని చర్చి నిర్వాహకులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. చర్చి అభివృద్ధికి విరాళం అందజేయడం సంతోషంగా ఉందని చైర్పర్సన్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, సాగర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ముత్తంగి చర్చికి రూ.10 లక్షల విరాళం
ముత్తంగి గ్రామంలోని డివైన్ చర్చి ప్రహరీ, ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఉన్న డివైన్ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి ప్రతినిధులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఇచ్చిన ఆర్థిక సాయం రూ.10 లక్షలు అందజేశారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తున్నారని, ఆయన స్ఫూర్తితో తాము అన్ని చర్చిలకు అండగా ఉంటున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముత్తంగి సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మెరాజ్ఖాన్, సందీప్, రామకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, టోపి శ్రీను తదితరులు పాల్గొన్నారు.