సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 20: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కృషితో సిద్దిపేట నియోజకవర్గం విద్యారంగంలో విరాజిల్లుతుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరీశ్రావు చొరవ.. నాట్కో సౌజన్యంతో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలను డిజిటల్ బోధన, కంప్యూటర్ ల్యాబ్తో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అదే తరహాలో మల్టీపర్పస్ హైస్కూల్, గర్ల్స్ హైస్కూళ్లను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం గర్ల్స్ హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ బోధన కోసం 8 క్లాస్రూమ్లలో 8 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పనులు పూర్తయినందున బుధవారం మాజీ మంత్రి హరీశ్రావు వీటిని ప్రారంభించనున్నారు.
విద్యార్థుల మేధస్సును పెంచేలా ఇప్పటి నుంచే సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకు ఈ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడనున్నది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సహకారం, రూ.50 లక్షల సీఎస్ఆర్ నిధులతో 21 కంప్యూటర్లను ల్యాబ్లో ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆన్లైన్ మాధ్యమంగా పాఠాలు నేర్చుకునేలా ఎనిమిది క్లాస్ రూమ్లలో 8 డిజిటల్ స్క్రీన్లు అమర్చారు. తమ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తూ కంప్యూటర్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.