రామాయంపేట/ మెదక్ రూరల్/ పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట, డిసెంబర్ 25 : పట్టణంలోని ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం వేంకటేశ్వర, రాజరాజేశ్వర, నగరేశ్వర ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమాలు చేశారు. వేంకటేశ్వర స్వామి పల్లకీసేవను ఆలయ కమిటీ అధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పద్మావతి, వేంకటేశ్వరస్వామికి పండితులు అభిషేకాలు చేశారు.
ఘనంగా ఆలయ వార్షికోత్సవాలు
రామాయంపేట పట్టణంలోని రాజేంద్రనగర్ కాలనీలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయంలో 17వ వార్షికోత్సవాలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు భూమయ్య, పూజారి శ్రీధరాచార్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
మల్లన్నకు పట్నాలతో ప్రత్యేక పూజలు
మెదక్ మండలం మంబోజిపల్లి శివారులోని కొయ్యగుట్ట పై కొలువుదీరిన మల్లికార్జునస్వామికి పూజారి మల్లన్న అధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఒడి బియ్యం సమర్పించి, పట్నం వేసి, మొక్కులు తీర్చుకున్నారు.
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
పెద్దశంకరంపేట మండలకేంద్రంలోని తిరుమలాపురం కాలనీలో వైద్యుడు శ్రీనివాస్ ఇంటిలో అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. రామచంద్రాచారి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, సర్పంచ్ కుంట్ల రాములు, గురుస్వాములు రామన్న, వెంకట్రావ్, రామ్మూర్తి, పరందాం, సురేం ద్ర, శ్రీహరి, నరేశ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
28న అయ్యప్ప మహాపడిపూజ
చిన్నశంకరంపేట మండలకేంద్రం శివారులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఈనెల 28న మహాపడిపూజ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు స్వాములు గంగానరేందర్, మైనంపల్లి రంగారావు తెలిపారు. బుధవారం అయ్యప్పస్వామికి పంచామృత అభిషేకం, విశేష పుష్పాలంకరణ నిర్వహిస్తామన్నారు. సాయంత్రం సోమేశ్వర ఆలయం నుంచి అయ్యప్ప దేవాలయం వరకు అయ్యప్పస్వామి ఉత్తర విగ్రహాన్ని అశ్వవాహనంపై ఊరేగింపు నిర్వహిస్తామని వివరించారు.
కురుమ సంఘం కమిటీ ఎన్నిక
సిద్దిపేట, డిసెంబర్ 25 : కురుమ యువ చైతన్య సమితి నూతన మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కమిటీ మండల గౌరవ అధ్యక్షులుగా కర్రే రాజు కురుమ, మండల అధ్యక్షుడిగా కొత్త భగత్ కురుమ, ఉపాధ్యక్షులుగా కర్రె పరశరాములు, బెదురు పరమేశ్వర్ కురుమ, అచ్చిన రాములు కురుమ, బాల్ద పరమేశ్వర్ కురుమ, ప్రధాన కార్యదర్శిగా బాలకిషన్ కురుమ, కార్యదర్శిగా గంభీపురం హరీశ్ కురుమ, సహాయ కార్యదర్శిగా వరిగంటి శ్రీకాంత్ కురుమ, సోషల్ మీడియా కన్వీనర్గా ప్రశాంత్ కురుమ, కార్యవర్గ సభ్యులుగా మంత్రి వినయ్ కురుమ, పులి సంతోష్ కురుమ, పెర్నే వెంకటేశం కురుమ, ఆశమ్మల్ విజయ్ కురుమను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు మీసం సత్యనారాయణ కురుమ, గౌడ రాజ్కుమార్ కురుమ, యాదగిరి కురుమ, నర్సింహ కురుమ, వాసర యాదగిరి కురుమ పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
మిరుదొడ్డి, డిసెంబర్ 25 : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని బీఆర్ఎస్ నాయకుడు కమలాకర్రెడ్డి, నైపుణ్య యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మొగుళ్ల ఐల య్య అన్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి 98వ జయంతిని పరస్కరించుకొని ఆదివారం మి రుదొడ్డిలో నెహ్రూ యువకేంద్రం, నైపుణ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహపూర్వకంగా క్రీడ నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో యువకులు రాము, సాయి, గోపి, కరుణాకర్, కొండల్ పాల్గొన్నారు.