సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్కు మహర్దశ పట్టింది. కోట్లాది రూపాయలతో పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా అభివృద్ధి చేయడంతో ప్రజలకు అన్ని మౌలిక వసతులు సమకూరాయి. తూప్రాన్ మండలంలో గ్రామాలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నాయి. పలు గ్రామాల్లో ఇప్పటి వరకు సుమారు రూ.120 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. మరో రూ.50 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. తూప్రాన్ మున్సిపాలిటీలో రూ.180 కోట్లతో పనులు జరుగుతుండగా, రూ.9 కోట్లతో 50 పడకల దవాఖాన నిర్మించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అత్యాధునిక హంగులతో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, టోల్ప్లాజా వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డు, కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. రూ.25.20 కోట్లతో తూప్రాన్లో 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి లబ్ధిదారులకు అందజేశారు. పట్టణాభివృద్ధికి మంత్రి హరీశ్రావు మరో రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు.
రామాయంపేట/తూప్రాన్ 12: పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా భారీగా నిధులు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రగతికి బాటలు వేస్తున్నారు. 70 ఏండ్ల సమైక్య పాలనలో లేని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగింది. నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తూప్రాన్తోపాటు మండలంలోని గ్రామాలు నేడు ప్రగతిలో దూసుకుపోతున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలంలో ఆయా గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. తూప్రాన్ మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటి వరకు సుమారు రూ.120 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. మరో రూ.50 కోట్లతో పనులతో కొనసాగుతున్నాయి. తూప్రాన్ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడడంతో ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేసింది. రూ.9 కోట్లతో 50 పడకల దవాఖాన నిర్మించారు. దీంతో పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నది. రూ.20 లక్షలతో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం, రూ.70 లక్షలతో ఆయుర్వేద దవాఖాన భవనాలు నిర్మించారు. రూ.4.80 కోట్లతో ఆర్అండ్బీ గెస్ట్హౌస్, రూ.5 కోట్లతో మున్సిపల్ భవనం, రూ.4 కోట్లతో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, టోల్ప్లాజా వద్ద రూ.4 కోట్లతో మార్కెట్ యార్డు, రూ.కోటితో వే సైడ్ మార్కెట్, రూ.30 లక్షలతో మహిళా భవనం, రూ.60 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం పూర్తయ్యాయి. రూ.25.20 కోట్లతో తూప్రాన్లో 500 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తై లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలో రూ.7.60 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇవేకాకుండా పట్టణానికి మంత్రి మరో రూ.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు తయారుచేశారు.
తూప్రాన్లోని ప్రభుత్వ దవాఖానను ఆధునీకరించారు. గతంలో ఇక్కడ కొనసాగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నామమాత్రంగా పని చేసేది. కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే ఉపయోగపడేది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరువతో రూ.9 కోట్లతో అధునాతన వసతులతో 50 పడకల హెల్త్ సెంటర్ కమ్యూనిటీ దవాఖాన నిర్మించారు. దీంతో పట్టణంతోపాటు మండలంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు వీలు కలిగింది. ప్రసవాలు చేసేందుకు ప్రత్యేక వైద్య నిపుణులు ఈ దవాఖానలో అందుబాటులో ఉంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. జిల్లాలో ఏకైక ఆయుర్వేద దవాఖానగా కొనసాగుతూ శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో రూ.70 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో తూప్రాన్ దినదినాభివృద్ధి చెందుతున్నది. మండల కేంద్రంగా కొనసాగిన తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణంగా రూపాంతరం చెందింది. తూప్రాన్ పట్టణాభివృద్ధికి కోసం సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల నిధులను ప్రత్యేకంగా 2014లోనే కేటాయించారు. దీంతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగాయి. పట్టణంలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో కళకళలాడుతున్నది. ప్రతి వీధి సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో శుభ్రంగా కనిపిస్తున్నది.
తూప్రాన్ మున్సిపాలిటీలో ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరింది. ఆ భవనాన్ని కూల్చి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.60 లక్షలతో కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. ఆ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు.
వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తూప్రాన్ పట్టణంలోని రోడ్డు పొడవునా డివైడర్లు ఏర్పాటు చేశారు. రావెళ్లి చౌరస్తా నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు ఈ డివైడర్లు నిర్మించారు. డివైడర్ మధ్యలో పూల మొక్కల నాటి, వాటిని పెంచుతున్నారు. పట్టణం జిగేల్మనేలా బట్టర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్లన్నీ జిగేల్మని మెరిసిపోతున్నాయి. రోడ్డు పక్కన పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు.
తూప్రాన్లో ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి వసతిని కల్పించడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ.25.20 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి, లబ్ధిదారులకు అందజేశారు. దీంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తూప్రాన్లో ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్ చౌరస్తాలో రూ.4 కోట్లతో ప్రత్యేకంగా వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు నిర్మించారు. భవిష్యత్లో పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం దీన్ని నిర్మించారు. పనులు పూర్తయిన తర్వాత మంత్రి హరీశ్రావు దీన్ని ప్రారంభించారు. తూప్రాన్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందడం, ఈ సమీకృత మార్కెట్ అందుబాటులోకి రావడంతో పట్టణ ప్రజలకు ఎంతో మేలు చేకూరింది. దీంతో పాటే రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద రూ.4 కోట్లతో మార్కెట్ యార్డు నిర్మించారు. వై సైడ్ మార్కెట్ యార్డు నిర్మించడంతో రైతులు అక్కడ కూరగాయలు, పంటలను విక్రయించుకుంటున్నారు. దీంతో రైతులతో పాటు వినియోగదారులకూ లబ్ధి చేకూరుతున్నది. తూప్రాన్లో జాతీయ రహదారి-44 పక్కన తెలంగాణ రాష్ట్రం రాక ముందు పండ్లు, కూరగాయలను చిరువ్యాపారులు విక్రయించేవారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితో ఇక్కడ రూ.1.60 కోట్లతో చిరు వ్యాపారుల కోసం సకల సౌకర్యాలతో అద్భుతంగా ‘వేసైడ్’ మార్కెట్ నిర్మించి అందుబాటులోకి తెచ్చారు
2014కు ముందు రోడ్లు పూర్తిగా అధ్వానంగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మట్టి, కంకర రోడ్లన్నీ నేడు బీటీతో కళకళలాడుతున్నాయి. జాతీయ రహదారిపై నుంచి నేరుగా మారుమూల గ్రామాలకు వాహనాదారులు చేరుకునేలా రోడ్డు సదుపాయం కల్పించారు. మండల కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అన్ని రోడ్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషితో రోడ్లపై వాహనదారులు సాఫీగా ప్రయాణిస్తున్నారు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి చేరుకునేందుకు వీలుగా లింక్, బీటీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు. సింగిల్ రోడ్లు డబుల్గా మారాయి. ప్రయాణం ఇబ్బందికరంగా ఉన్న గ్రామాలకు వంతెనలు నిర్మించి, రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ పాలనలో తూప్రాన్ మండలంలోని గ్రామాలన్నీ బాగుపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. సీఎం కృషితో వాగులు, వంకల్లో నీళ్లు పుష్కలంగా పారుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి.
సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందుతున్నది. తూప్రాన్ పట్టణాన్ని, మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. హల్దీవాగుకు కాళేశ్వరంతో గోదావరి జలాలు తీసుకొచ్చన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. పేదల సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకున్నట్లు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే సత్వర అభివృద్ధి జరిగింది. గత పాలనలో ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటేనే భయంగా ఉండేది. నేడు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. దవాఖానను ఇంత అభివృద్ధి చేస్తరని అనుకోలే. మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
సమైక్య పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించారు. సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధికి తగినంత నిధులు కేటాయిస్తున్నారు. రోడ్లు, తాగునీరు, 24 గంటల కరెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. మంత్రికి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.