చిన్నశంకరంపేట, డిసెంబర్ 14 : మండలంలోని సూరారం గ్రామం నుంచి సూరారం తండా మీదుగా చందంపేట వరకు బీటీరోడ్డు, బ్రిడ్జి నిర్మా ణానికి రూ. 5.10కోట్లు మంజూరు చేయ డంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సూరారం గ్రామస్తులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీరజ, ఎంపీటీసీ అనురాధ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్తోనే తండాలు అభివృద్ధి చెందు తున్నట్లు పేర్కొన్నారు.
బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూ రు చేసిన మంత్రులు హరీశ్రావు సత్యవతీరాథోడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీటీసీ మాధవికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిల్కనాగరాజు, ఉపసర్పంచ్ గోవర్ధన్రెడ్డి, నాయకులు పవన్గౌడ్, దుర్గాపతి పాల్గొన్నారు.