మెదక్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువతి చెందిన సంఘటన నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పాండురంగం తన కూతురు అపర్ణ (18)తో కలిసి బైక్పై నస్కల్ గ్రామానికి వస్తుండగా దేవునిపల్లి స్థానిక పెట్రోల్ బంక్ వద్ద వారి బైక్ను డీసీఎం ఢీ కొట్టడంతో అపర్ణ అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రి పాండురంగానికి తీవ్ర గాయాలు కాగా అతనిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.