దళితబంధు మొబైల్ టిఫిన్ సెంటర్ను
ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, మే14 : నిన్న మెన్నటి వరకు టిఫిన్ సెంటర్లో కూలీగా పని చేసిన పట్టణంలోని 2వ వార్డుకు చెందిన మెతుకు రాజు, దళితబంధు డబ్బులతో సొంతంగా సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో మొబైల్ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. దళితబంధు లబ్ధిదారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్రావు శుక్రవారం సాయంత్రం మొబైల్ టిఫి న్ సెంటర్ను ప్రారంభించి, అక్కడే టిఫిన్ చేశారు.
తనతో పాటు వచ్చిన ప్రజాప్రతినిధులకు సైతం అక్కడే టిఫిన్ చేయించారు. తన తొలి బోణిగా టిఫిన్ డబ్బులు చెల్లించారు. తన టిఫిన్ సెంటర్ను మంత్రే స్వయంగా వచ్చి ప్రారంభించడం.. బోణి చేయడంతో రాజుకుటుంబ సభ్యుల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు జీవితాంతం రుణపడి ఉంటామని రాజు కుటుంబం తెలిపింది.