మిరుదొడ్డి, ఫిబ్రవరి 24: అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందె గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వివిధ రకాల పంటలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.
గ్రామాల్లో పంట నష్టపోయిన ప్రతి రైతు వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తారన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల నష్ట పరిహారంతో పాటు సబ్సిడీ విత్తనాలు అందించాలని గ్రామస్తులు ఆమెకు వినతిపత్రం అంజేశారు. కార్యక్రమంలో అందె సర్పంచ్ కడారి యాదగిరి, దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాందారి ఇంద్రసేనారెడ్డి, దుబ్బాక ఏడీఏ మల్లయ్య, మిరుదొడ్డి ఏవో బోనాల మల్లేశం, ఉప సర్పంచ్ పరశురాములు, అందె గ్రామస్తులు సూకురి లింగం, శంకర్, ప్రవీణ్, మహేశ్, రాజేందర్, రైతులు పాల్గొన్నారు.