పెద్దశంకరంపేట, డిసెంబర్ 9 : రైతులు యాసంగి సీజన్లో వ్యవసాయ బోరుబావుల వద్ద, చెరువు భూముల్లో ప్ర ధానంగా శనగ పంటను పండిస్తారు. నాలుగు నెలల పంట కాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడు లు వస్తాయి. పూతదశలో పంటకు వివిధ రకాల చీడపీడలు ఆశించి, నష్టపరుస్తుంటాయి. దీనివల్ల దిగుబడి రాక రైతుకు నష్టం మిగులుస్తుంది.
శనగ పంటకు రైతులు సరైన సమయాల్లో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ఆశించిన మేర దిగుబడి సాధించవచ్చని ఇన్చార్జి ఏడీఏ రాంప్రసాద్ తెలిపారు. పెద్దశంకరంపేట మండంలంతోపాటు చుట్టుపక్కల అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాల్లోని రైతులు శనగ పంట ను సాగు చేస్తారు. కానీ, పంటకు ఆశించే తెగుళ్లను వ్యవసాయాధికారుల సూచనలతో చర్యలు చేపట్టి పంటను రక్షించుకోవాలి. ముఖ్యంగా శనగ పంటకు తామర పురుగు, పేను బంక, పచ్చదోమ, ఆకుముడత, లద్దెపురుగుతోపాటు వివిధ తెగుళ్లు వస్తాయి. తెగుళ్లను పరిశీలిస్తూ సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. జిప్సం ఎరువును సకాలంలో పంటకు అందిం చాలి. దీంతో అధిక దిగుబడితోపాటు, నాణ్యమైన పంట రైతుల సొంతమవుతుంది. కలుపు తీశాక పూతదశలో ఉన్నప్పుడు జిప్సం ఎరువును వెదజల్లితే ఊడలు ధృడంగా వచ్చి అధిక ఊడలతో దిగుబడి పెరుగుతుందన్నారు.
1. తామర పురుగు తెగుళ్లు : శనగలో పిల్ల, పెద్ద తామర పురుగులు ఆకులపై చేరి, రసాన్ని పీల్చుతాయి. ఫలితంగా ఆకుల అడుగు భాగాన గోధుమ రంగు వర్ణాలతో మచ్చలు ఏర్పడుతాయి. దీనిని బట్టి తామర పురుగుగా గుర్తించాలి.
నివారణ చర్యలు : తామర పురుగు తొలి దశలో ఎకరానికి మోనోక్రోటోపాస్ 320 మి.లీ, వేపనూనె 1లీ. 1కిలో సబ్బుపొడి 200 లీటర్ల నీటికి 0.25 మి.మీ చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
2. పేనుబంక తెగుళ్లు : పేనుబంక పురుగులు కొమ్మల చివర్లతోపాటు లేత ఆకుల అడుగుభాగంలో చేరి, రసాన్ని పీల్చు తాయి. పూతదశలో ఆశించినప్పుడు పూతరాలుతుంది.
నివారణ చర్యలు : డైమిథియోట్ 2 మి.లీ, లేదా మిథైల్ ఓ డెమాటాస్ 2 మి.లీ, నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
3. పచ్చదోమ తెగుళ్లు : పచ్చదోమ శనగ పంటలో ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చుతాయి. ఫలితంగా ఆకు ల్లో ‘వి’ ఆకారంలో పసుపుపచ్చ మచ్చులు ఏర్పాడుతాయి.
నివారణ చర్యలు : డైమిథియోట్ 2 మి.లీ, లేదా మిథైల్ ఓ డెమాటాస్ 2 మి.లీ, నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
4. ఆకు ముడత తెగుళ్లు : పంటలో 15 రోజుల నుంచే ఆకు ముడత వస్తుంది. ఆకులపై గోదుమరంగు మచ్చలుంటా యి. ఆకులు ఎండిపోవడంతో పంటను నాశనం చేస్తుంది.
నివారణ చర్యలు : క్వినాల్పాస్ 2 మి.లీ, లేదా క్లోరిఫైరిఫాస్ లేదా అసిఫెట్ 1గ్రా నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
5. కాండం కుళ్లు వైరస్ తెగుళ్లు : పువ్వు, ఆకులపై ఎండు మచ్చలు ఏర్పడుతాయి. క్రమేణా కాండం నల్లబడి మొక్క చనిపోతుంది. వ్యాధి తీవ్రత పెరిగితే పంటనష్టం అధికం.
నివారణ చర్యలు : పంట పూతదశకు రాకముందే కలుపు మొక్కలను పూర్తిగా నిర్మూలించాలి. తెగుళ్లు సోకిన మొక్కలను తొలిగించాలి. దీంతో తెగుళ్ల నుంచి పంటను రక్షించుకున్నప్పుడు ఆశించిన దిగుబడి సాధించవచ్చు.