మెదక్ మున్సిపాలిటీ, మార్చి 17: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మతోన్మాద శక్తులకు ఓట్లు వేయకుండా లౌకిక శక్తులకు వేసి గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లాకేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో పార్టీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.
దేశంలో మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, దేశసంపద పూర్తిగా కార్పొరేట్ వ్యక్తులకు, శక్తులకు ధారాదత్తం చేస్తున్నదన్నారు.భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అని, మతోన్మాద శక్తులను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లేశం, నాయకులు నర్సమ్మ, నాగరాజు, సంతోష్, అజయ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.