సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 14: పోలీస్ కళాబృందం, సాంస్కృతిక సారథి సభ్యులు ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో పోలీస్ కళాబృందం, సిద్దిపేట జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..మూఢనమ్మకాలు, బాణామతి, సైబర్ నేరాలు, గృహహింస, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, సామాజిక రుగ్మతలపై సమష్టిగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఆర్వో రవి, తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు పాల్గొన్నారు.