జహీరాబాద్, మార్చి 6: శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాండ్ చేశారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ గృహం నుంచి భారీ ర్యాలీతో ఆర్డీవో కార్యాలయానికి చేరుకుకున్నారు. అనంతరం ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామని చెప్పి, ఇప్పడు డబ్బులు వసూలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ లు అమలు చేయకపోతే పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి.గుండప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాశ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, బీఆర్ఎస్ జహీరాబాద్ మండలాధ్యక్షుడు తట్టు నారాయణ, బీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్, రాములునేత, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.