నర్సాపూర్,ఫిబ్రవరి14 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా
నర్సాపూర్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీతారాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జోగు మల్లేశ్, ఎల్ర పోచయ్య, జోగు శ్రీశైలం తో పాటు ఇతర కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అందించే పథకాలలో ఏదో ఒకటి ప్రతి ఇంటికి చేరుతుందని వెల్లడించారు. మున్ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఇంకా పెరుగుతాయని, నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.
కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అశోక్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయోమొద్దీన్, జడ్పీటీసీ బాబ్యానాయక్, సర్పంచ్ పోచమ్మ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.