గజ్వేల్, మార్చి 6: అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు మాటమార్చారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు నేడు అధికారంలోకి రాగానే 20లక్షల కుటుంబాలపై రూ.20కోట్ల భారం వేసేందుకు సిద్ధమయ్యారని, ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దొచుకోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను పునరుద్ధరిస్తే గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారని గుర్తు చేశారు.
ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. ఒక ఫిల్లర్ను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్లోకి నీళ్లు నింపకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయోద్దీన్, కౌన్సిలర్లు బాలేశ్, చందు, రజిత, బీఆర్ఎస్ అధ్యక్షుడు నవాజ్మీరా, కుమార్, శ్రీనివాస్గౌడ్, నాయకులు బయ్యారం శ్రీనివాస్రెడ్డి, జాఫర్ఖాన్, గుంటుకరాజు, సాయిరెడ్డి, కిషన్రెడ్డి, యాదవరెడ్డి, కనకయ్య, జైపాల్రెడ్డి, రామచంద్రం, స్వామిచారి, దుర్గాప్రసాద్, ఆంజనేయులు, బీరప్ప పాల్గొన్నారు.