బెజ్జంకి, నవంబర్ 4: మండలకేంద్రంతోపాటు, పెరుకబండ, కల్లెపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. పార్టీ గెలుపుకోసం ప్రతిఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గతంలో రాష్ర్టాభివృద్ధికి కాంగ్రెస్ ఏమి చేయలేదని, వాటిని చెప్పే ముఖం లేక గ్యారంటీల పేరుతో ప్రజల ముం దుకు వస్తున్నారన్నారు. ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, మార్కెట్ కమి టీ చైర్పర్సన్ చంద్రకళ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.