మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 8: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో బంజారానగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని కల్పన రూపొందించిన ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం లభించిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి గురువారం తెలిపారు.
సుస్థిర వ్యవసాయం అనే ఉప అంశంలో ‘మల్టీపర్పస్ సోలార్ కిసాన్ రక్షక్ అగ్రికల్చరల్ సిస్టం’ అనే ప్రాజెక్టును కల్పన తయారుచేసిందన్నారు. ప్రదర్శనను వర్చువల్ పద్ధతిలో నిర్వహించినట్లు తెలిపారు. కల్పనతో పాటు గైడ్ టీచర్ను కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ రమేశ్ అభినందించారు.