2018-19 వరి పంట నష్టపోయిన సిద్దిపేట జిల్లా రైతులకు పరిహారం
పంట బీమా కింద 8925 మంది రైతులకు రూ.20 కోట్లు విడుదల
ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిలా అద్భుత సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. 2018-19 సంవత్సరానికి గానూ వరి పంట నష్టపోయిన సిద్దిపేట జిల్లాలోని రైతులకు ఫసల్ బీమా యోజన కింద రూ.20 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్లు, కరువు వంటి విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులకు సాయం అందని పరిస్థితి నెలకొన్నది. 2018 యాసంగిలో సిద్దిపేట జిల్లాలోని 8925 మంది రైతుల పంట నష్టం వాటిల్లింది. యాసంగిలో నష్టపోయిన రైతుల పొలాలను క్షేత్రస్థాయిలో మంత్రి హరీశ్రావు సందర్శించిన విషయం తెలిసిందే. వ్యవసాయ, ఇతరశాఖల సమన్వయంతో అప్పటికప్పుడే జరిగిన పంట నష్టంపై ఆరా తీసి, అంచనా వేయించి పంట నష్టం మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వ్యవసాయశాఖ పంట కోత ప్రయోగాల ద్వారా పంట దిగుబడులు నిర్ధారించి, నష్టస్థాయిని లెక్కించి వాటి వివరాలను జిల్లా గణాంకశాఖ ద్వారా బీమా కంపెనీలకు అందేలా చూశారు. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో బీమా కంపెనీ సిద్దిపేట జిల్లాలోని రైతులు 8925 మందికి రూ.20,52,98,653 రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికార వర్గాలు తెలిపాయి. 2018-19 సంవత్సరానికి గానూ వరి పంట నష్టపోయిన రైతుల విస్తీర్ణాన్ని బట్టి నష్టాన్ని అంచనా వేయించి నిధులు విడుదల చేయించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు.
నియోజకవర్గ, మండలాల వారీగా..
సిద్దిపేట నియోజకవర్గంలోని 3109 మంది రైతులకు రూ.6,85,56,631 విడుదల కాగా, సిద్దిపేట అర్బన్ మండలంలోని 9 మంది రైతులకు రూ.1,63,127, సిద్దిపేట రూరల్ మండలంలోని 110 మంది రైతులకు రూ.30,72,451, నంగునూరు మండలంలోని 1983 మంది రైతులకు రూ.4,80,26,722, నారాయణరావుపేట మం డలంలో 742 మంది రైతులకు రూ.7,20,977, చిన్నకోడూరులోని 265 మంది రైతులకు రూ.1,65,73,351 విడుదలైనట్లు తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గంలో…
దుబ్బాక నియోజకవర్గంలో 1384 మంది రైతులకు రూ.6,85,56,631 విడుదల కాగా, దుబ్బా కలో 234 మంది రైతులకు రూ.23,96,109, మిరుదొడ్డి మండలంలోని 866 మందికి రూ.57,47,140, తొగుట మండలంలోని 229 మంది రైతులకు రూ.42,61,185, రాయపోల్ మండంలోని 55 మంది రైతులకు రూ.6,85,883 విడుదలైనట్లు తెలిపారు.
గజ్వేల్ నియోజకవర్గంలో…
గజ్వేల్ నియోజకవర్గంలోని 935 మంది రైతులకు రూ.1,31,79,054 విడుదల కాగా, గజ్వేల్లో 150 మంది రైతులకు రూ.18,75,567, కొండపాకలోని 191 మంది రైతులకు రూ.19,16,200, జగదేవ్పూర్లో 171 మంది రైతులకు రూ.38,20,737, మర్కూ క్లో 35 మంది రైతులకు రూ.8,56,707, ములుగులో 274 మంది రైతులకు రూ.37,87,741, వర్గల్ మండలంలోని 114 మంది రైతులకు రూ.9,22,100 విడుదలయ్యాయి.
జనగామ నియోజకవర్గ పరిధిలో…
సిద్దిపేట జిల్లాలోని జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్ మండలాల్లోని 594 మంది రైతులకు రూ.1,02,11,122 విడుదల కాగా, చేర్యాలలోని 220 మంది రైతులకు రూ.66,84,363, కొమురవెల్లి మండలంలోని 119 మంది రైతులకు రూ.7,37,993, మ ద్దూర్లో 255 మంది రైతులకు రూ.27,88,765 విడుదలైనట్లు మంత్రి తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో…
హుస్నాబాద్ నియోజకవర్గంలోని 2766 మంది రైతులకు రూ.9,81,75,893 విడుదల కాగా, కోహెడ మండలంలోని 684 మంది రైతులకు రూ.3,03,12,845, హుస్నాబాద్ మండలంలోని 658 మంది రైతులకు రూ.78,83,861, అక్కన్నపేట మండలంలోని 1424 మంది రైతులకు రూ.5,99,79,185 విడుదలయ్యాయి.
బెజ్జంకి మండలంలో..
జిల్లా పరిధిలోని బెజ్జంకి మండలంలోని 137 మంది రైతులకు రూ.20,85,631 పంట నష్టం పరిహారం అందించినట్లు మంత్రి తెలిపారు.