మెదక్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రాహుల్రాజ్ను మెదక్ కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. గతేడాది ఫిబ్రవరిలో మెదక్ జిల్లాకు కలెక్టర్గా వచ్చానని, ఏడాది కాలం జిల్లాలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని గుర్తుచేశారు.
మెదక్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్ ఆదిలాబాద్ ఆర్డీవోగా బదిలీపై వెళ్లారు. భూపాలపల్లి ఆర్డీవోగా పనిచేస్తున్న కె.రమాదేవి మెదక్ ఆర్డీవోగా రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నారాయణఖేడ్, ఫిబ్రవరి 28: ‘ఖేడ్’ ఆర్డీవో వెంకటేశ్ బదిలీ అయ్యారు. వెంకటేశ్ను హనుమకొండ ఆర్డీవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కల్లూరు ఆర్డీవో అశోక చక్రవర్తి ఇక్కడికి బదిలీపై రానున్నారు. ఆరు నెలల క్రితం వెంకటేశ్ ఇక్కడికి బదిలీపై వచ్చారు.