మెదక్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రెగ్యులర్గా ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేసి ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రైవేట్ దవాఖానల రిజిస్ట్రేషన్, రెన్యువల్, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంపై డీటీఎఫ్ (డిస్ట్రిక్ట్ టాస్ ఫోర్స్ మీటింగ్) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు దవాఖానల రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్ను పరిశీలించారు.
వ్యాలిడిటీ దాటిపోయి ఇంకా అప్లయ్ చేయని వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. డివిజన్ వారీగా డిప్యూటీ వైద్యాధికారులు రెగ్యులర్గా ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేసి ఎకడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడాలన్నారు. అంతేకాకుండా పొగాకు వాడటం వల్ల కలిగే వ్యాధుల గురించి వివరించారు. క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలు, హైసూల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలని సూచించారు. పొగాకు వల్ల కలిగే రోగాల గురించి పోస్టర్స్ తయారుచేసి అతికించాలని చెప్పారు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో నిఘా ఉంచాలని తెలిపారు. 18 ఏండ్ల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చందునాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామ్మోహన్, డీఈవో రాధాకిషన్, డిప్యూటీ డీఎంహెచ్వోలు విజయనిర్మల, అనిలా, వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఆశాకుమారి, మున్సిపల్ అధికారులు, లెక్చరర్లు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.