సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 11: జిల్లాలో పదో తరగతి ఫలితాలను 100శాతం సాధించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపునిచ్చారు. చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పదో తరగతి విద్యా బోధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితర అంశాలపై మండలస్థాయి అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాద్యాయులు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. 100శాతం ఉత్తీర్ణత సాధించే విధం గా బోధన జరగలన్నారు. ఆ దిశగా హెచ్ఎంలు, ఆయా శాఖల అధికారులు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత జిల్లా స్థాయి, మండలస్థాయి అధికారులదే అని స్పష్టం చేశారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పని చేసినప్పుడే లక్ష్య సాధించగలమన్నారు. ప్రస్తుత సంవత్సరం 6పేపర్ల పరీక్షలు నిర్వహిస్తున్నందున, అందుకు తగి న విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాల ని, ప్రతి పాఠశాల 100శాతం ఉత్తీర్ణత సా ధించేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. అవసరమైన ప్రత్యేక మెటీరియల్ను పంపిణీ చేశా మని గుర్తు చేశారు. విద్యార్థుల బోధనలో సబ్జెక్టు టీచర్లే రథసారథులన్నారు. వారిని ఒక యూనిట్గా పని చేయించే బాధ్యత హెచ్ఎంలదే అని పేర్కొన్నారు. రోజువారి షెడ్యూలు తయారు చేసి సబ్జెక్ట్ టీచర్లకు అందజేయాలన్నారు. అదేవిధంగా నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని హెచ్ఎంలకు సూచించారు. ప్రతి విద్యార్థి ఫలితాలపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లల చదు వు విషయంపై తల్లిదండ్రులతో చర్చించాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తూ అవసరమైన సహకారాన్ని అందించాలని సూ చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఈవో రాజేశ్, మండలస్థాయి అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.