కేసీఆర్ గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభించారు. సీఎస్ శాంతికుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, మహమూద్అలీ, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బగ్గిలో ఆ ప్రాంతమంతా తిరిగి పరిశీలించారు. అనంతరం ఆరుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి ఇండ్ల పట్టాలు, తాళాలు అందజేశారు. కుటుంబసభ్యులతో కలిసి లబ్ధిదారులు ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశాలు చేశారు. తమకు సొంతిల్లు ఉంటుందని ఏనాడూ అనుకోలేదని, సీఎం సార్కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.
– రామచంద్రాపురం, జూన్ 22
రామచంద్రాపురం, జూన్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ప్రధాన గేటు వద్ద సీఎంకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ముఖద్వారంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, మహమూద్అలీ, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డితో కలిసి సీఎం ఆవిష్కరించారు. అనంతరం బగ్గి వాహనంలో కూర్చోన్ని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం మొత్తం పరిశీలించారు.
ప్రాజెక్ట్ వివరాలను మంత్రి కేటీఆర్, అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. ఆ తర్వాత 93వ బ్లాక్లో ఏర్పాటు చేసిన స్టేజి వద్దకు సీఎం కేసీఆర్ చేరుకుని లబ్ధిదారులైన పటాన్చెరుకు చెందిన గడ్డమీది రేణుక, అసియాబేగం, రంగారెడ్డి జిల్లాకు చెందిన శారద, పులిగిల్లదేవి, చాకలి సుజాత, కేతావత్ కీర్తికి డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు, ఇంటి తాళాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. జీవితంలో సొంతిల్లు వస్తదని అనుకోలేదని, సీఎం కేసీఆర్ సార్ చేతుల మీదుగా ఇంటి పట్టాలు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని లబ్ధిదారులు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఇంటిలో లబ్ధిదారులతో పూజారులు ప్రత్యేక పూజలు చేసి, కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, డీఈసీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అనిరుధ్గుప్తా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఘనంగా ఏర్పాట్లు..
కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్వాహకులు డీఈసీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ముఖద్వారం నుంచి 93వ బ్లాక్ మొత్తం పువ్వులతో అలంకరించారు. ముఖద్వారంలో, 93వ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలతో డబుల్ బెడ్రూం ప్రాంగణం గులాబీమయంగా మారింది. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు, అడుగడుగునా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. డాగ్ స్కాడ్, బాంబ్ స్కాడ్ బృందాలు సీఎం పర్యటించే ప్రాంతాల్లో ముందుగానే తనిఖీలు చేశారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతిరథం (బస్సు)లో కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్లారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, అరికెపూడి గాంధీ, ఎంపీ రంజిత్రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, కృష్ణారావు, వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు బాబ్జీ, లచ్చిరాం, శ్రీశైలం, సుచరిత, చిట్టి, జ్యోతి, నాగరాజు, జయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ నర్సింహరావు, ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్, తహసీల్దార్ జయరాం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, నాయకులు వెంకట్రాంరెడ్డి, ఇంద్రారెడ్డి, శ్రీపాల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, యాదయ్య, నర్సింహ, అధికారులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
బగ్గిని డ్రైవ్ చేసిన మంత్రి కేటీఆర్
కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్వయంగా బగ్గిని డ్రైవ్ చేశారు. మొదట బగ్గిలో ఎక్కిన ఆయన తర్వాత గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని తీసుకొచ్చి ఆయనే డ్రైవ్ చేస్తూ అందరికీ ఇండ్ల సముదాయాన్ని చూపించారు. ఇండ్ల ప్రాంగణం మొత్తం ఒక రౌండ్ వేశారు. సింపుల్గా మంత్రి కేటీఆర్ బగ్గిని డ్రైవ్ చేస్తు వెళ్లడంతో అక్కడ ఉన్న వారందరూ చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.