అందోల్, డిసెంబర్ 25 : ప్రజా సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందనే నమ్మకంతోనే రాయికోడ్ మండలంలోని ఖంజల్పూరం కాంగ్రెస్ ఉప సర్పంచ్ షేక్మహ్మద్, నాయకులు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా వారంలో నాలుగైదురోజులు ప్రజల మధ్యలోనే ఉంటూ ఎమ్మెల్యే చేసే అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. గత పాలకులు నియోజకవర్గాన్ని, కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పార్టీ బలోపేతంపై తమవంతు కృషిచేస్తూ పార్టీకి కట్టుబడి ఉంటామన్నారు.