ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి అర్హులందరికీ అందజేస్తుండగా, మరింత మందికి లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ప్రభుత్వం రూ.3లక్షల సాయాన్ని అందించనున్నది. దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా మూడు విడతల్లో నేరుగా లబ్ధిదారుడి అకౌంట్లోకి డబ్బులు జమచేయనున్నది. ఇందుకోసం గత నెల 10వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరించింది. తొలి విడతలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు 14250 గృహాలను మంజూరు చేయగా, ఐదు నియోజవకవర్గాల్లో కలిపి 56005 మంది దరఖాస్తు చేసున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి సర్వే చేసిన అధికారులు 25114 మందిని అర్హులుగా గుర్తించారు. వీరందరికీ త్వరలోనే మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
– సంగారెడ్డి, సెప్టెంబర్ 3
సంగారెడ్డి, సెప్టెంబర్ 3: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు తెలంగాణ సర్కారు గృహలక్ష్మి పథకానికి శ్రీకారంచుట్టింది. ఇల్లు కట్టుకునేందుకు సొంత జాగా ఉంటే చాలు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సాయాన్ని మూడు విడతల్లో ప్రభుత్వం అందించనున్నది.
మహిళా దరఖాస్తులకే ప్రాధాన్యం..
గృహలక్ష్మి పథకంలో ఇల్లు నిర్మించుకోడానికి దరఖాస్తు చేసుకున్న వాటిలో మహిళలకే అధిక ప్రా ధాన్యం ఇస్తున్నారు. కుటుంబ సభ్యుల పేరిట ఆహార భద్రత కార్డు, లబ్ధిదారుడి పేరిట సొంత స్థలం కనీసం ఒక గుంట అయినా పట్టా లేదా గ్రామకంఠం భూమి ఉండాలి. ఇదివరకు సొంత ఇల్లు లేని వారై ఉండాలి. ఆర్సీసీ ఇల్లు ఉంటే అనర్హులుగా ప్రకటించనున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్నట్లు ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు, ఆహార భద్రతా కార్డు కలిగి ఉండాలి. గతంలోఇల్లు మంజురైనా, దళిత బంధు, ఇతర పథకాలు పొందితే దరఖాస్తులు తిరస్కరిస్తారు. ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగులకు 5శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలు, మైనార్టీలకు 50 శాతం, జనరల్కు 15 శాతం కేటాయించారు. శిథిలావస్థలో ఇల్లు ఉంటే ఇంటి పన్ను, విద్యుత్ బిల్లు చూపిస్తే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే వెయిటింగ్ లిస్ట్ రూపొందించి, తర్వాత మంజురైన ఇండ్లలో ప్రాధాన్యత కల్పించేందుకు జాబితా తయారు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో దరఖాస్తులు 56005
సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలు, నర్సాపూర్లోని హత్నురా మండలంతో కలిపి మొత్తం 56,005 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం జిల్లాకు మొదటి విడతలో 14,250 ఇండ్లు మం జూరుచేసింది. అందోల్ నియోజక వర్గానికి 2100, నారాయణఖేడ్కు 2700, పటాన్చెరుకు 3వేలు, సంగారెడ్డికి 3 వేలు, జహీరాబాద్కు 3వేలతో పాటు నర్సాపూర్ నియోజకవర్గంలోని హ త్నురా మండలానికి 450 గృహాలు కేటాయించిం ది. ఇందులో 25,114 దరఖాస్తులు అర్హత సాధించాయి. 27,862 దరఖాస్తులను కంపూటర్లలో నమోదుచేశారు. అర్హత సాధించిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో నిధులు మంజూరు చేయనున్నది. ఇందుకోసం ఎప్పటికప్పుడు నిర్మాణం పూర్తయిన ఫొటోలు అప్లోడ్ చేస్తే, విడతకు రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవుతాయి.
తొమ్మిది మండలాల్లో వందశాతం సర్వే
సంగారెడ్డి జిల్లాలోని అందోల్ మండలంలో 1652 దరఖాస్తులకు 1221, నారాయణఖేడ్ మండలంలో 1285 దరఖాస్తులకు 801, పటాన్చెరు మండలంలో 375 దరఖాస్తులకు 164 దరఖాస్తులు అర్హత సాధించాయి. బొల్లారం మున్సిపాలిటీలో 22 దరఖాస్తులు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా అందులో 12 దరఖాస్తులు అర్హత సాధించాయి. పటాన్చెరు పట్టణంలో 230 దరఖాస్తులు పెట్టుకోగా 40 దరఖాస్తులు అర్హత సాధించడంతో పాటు సర్వే పూర్తి చేసుకున్నాయి. సదాశివపేట మున్సిపాలిటీలో 939 దరఖాస్తులకు 747, సంగారెడ్డి మండలం లో 1175 దరఖాస్తులకు 641 అర్హత సాధించి సర్వేలను పూర్తిచేసుకున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో 1159 దరఖాస్తులకు 796 అర్హత సాధించి, సర్వే పనులు పూర్తి చేసుకున్నాయి. ఝ రాసంగం మండలంలో1821 దరఖాస్తులకు 1615 చేశారు