పటాన్చెరు, ఫిబ్రవరి 2 : తెలంగాణలో నీలి విప్లవం ప్రారంభమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని మత్స్యసహకార సంఘం ప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మత్స్యకార సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో, జలవనరుల్లో వేసి మత్స్యకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. మత్స్యకారులు పెంచిన చేపపిల్లలకు తెలంగాణలోనే కాకుం డా పక్క రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఏర్పడిందని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులకు ప్రోత్సాహం లభిస్తున్నదన్నారు.
నియోజకవర్గం పరిధిలోని మత్స్యకారులకు అండగా ఉంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 38 మత్స్య సహకార సంఘాలు ఉండగా, 1752 మంది మత్స్యకారులు సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రభు త్వం నిర్దేశించిన విధంగా మరో 4529మత్స్యకారులు సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఈ నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సభ్య త్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. 18నుంచి 65 ఏండ్లు గల అభ్యర్థులు, మత్స్యశాఖ ఆధ్వర్యం లో నిర్వహించే పరీక్షలకు హాజరై, సభ్యత్వాన్నీ నమోదు చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 15లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని అధికారులకు, సొసైటీ ప్రతినిధులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మత్స్యశాఖ అధికారి సతీష్, సహకార సంఘం ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి పాల్గొన్నారు.