కాగజ్నగర్, ఆగస్టు 15 : స్వాతంత్ర పోరాటంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు పాల్గొనడం మనందరికీ గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కాగజ్నగర్లో పట్టణంలోని పలు కాలనీల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ వీరుడు కుమ్రం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీలాంటి మహనీయులు దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారితో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారని స్పష్టం చేశారు.
మనం ఈ దేశంలో పుట్టడం గర్వకారణమని, ఇప్పటికీ అనేక దేశాల్లో చదువుకునే హకు కూడా లేదని, అమ్మాయిలు పుస్తకాలు పట్టుకుంటే నేరంగా చూస్తున్నారన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి, ఝౌన్సీ రాణి, గాంధీ, అంబేడర్ వంటి మహనీయులు మనకు స్వాతంత్రాన్ని సాధించి పెట్టారని స్పష్టం చేశారు. స్వేచ్ఛ అంటే మొబైల్ వాడడం, గంజాయి సేవించడం, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, పాఠశాలలకు ఆలస్యంగా రావడం, చీటింగ్ చేయడం, పరీక్షల్లో కాపీ కొట్టడం కాదన్నారు.
పుస్తకాలు చదవాలి, మహనీయుల జీవితాల నుంచి గొప్ప విషయాలు నేర్చుకోవాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను గౌరవించడం అలవర్చుకోవాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో నా మొట్టమొదటి ఓటు ఈ ఫాతిమా హైసూల్లోనే వేశానన్నారు. మొబైల్ ఫోన్ క్రియేటివిటీని, జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఇతరులపై ఆధారపడకుండా సొంత శక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టణంలోని పలు వార్డులోఎ్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు పాల్గొన్నారు.