గజ్వేల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశ్వీరాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తన అభిమాన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ను చూడడానికి, ఆయన ప్రసంగం వినడానికి దండుగా కదిలివచ్చారు.
దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. జెండాలు, ఫ్లెక్సీలతో గజ్వేల్ పట్టణం, సభ పరిసరాలు గులాబీమయమయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రసంగానికి ఈలలు, చప్పట్లతో జేజేలు పలికారు. కళాకారుల బృందం ఆటపాట ఉర్రూతలూగించాయి.